SC classification : సీఎం రేవంత్‌తో మంద కృష్ణ మాదిగ భేటీ.. వర్గీకరణ అమలుపై కీలక చర్చలు

by Ramesh N |
SC classification : సీఎం రేవంత్‌తో మంద కృష్ణ మాదిగ భేటీ.. వర్గీకరణ అమలుపై కీలక చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి మంద కృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారు.

మందకృష్ణతో పాటు సీఎంని కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారని, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు అమలు పై భేటీలో చర్చించామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed