కేసీఆర్ తో మీటింగ్ అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   ( Updated:2024-06-26 11:53:02.0  )
కేసీఆర్ తో మీటింగ్ అనంతరం మాజీ మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం మరి కొంత మంది ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ సమావేశమయ్యారు. సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బాండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మీటింగ్ లో చాలా అంశాలపై మాట్లాడుకున్నామని, అవన్నీ సీక్రేట్ అన్నారు. అవన్నీ తర్వాత చెప్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పక్కాగా ప్రణాళికలు రచిస్తోందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎలాంటి సీక్రేట్స్ డిస్కషన్ చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. పార్టీ మారే వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించిన కేసీఆర్.. ఎవరూ తొందరపడవద్దని త్వరలోనే పరిస్థితులు మళ్లీ మనకు అనుకూలంగా మారుతాయని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మల్లారెడ్డి ప్రస్తావించిన సీక్రెట్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story