హస్తం గుర్తుకు ఓటేసి వంశీచందర్ రెడ్డి ని గెలిపించండి

by Disha Web Desk 11 |
హస్తం గుర్తుకు ఓటేసి వంశీచందర్ రెడ్డి ని గెలిపించండి
X

దిశ నారాయణపేట ప్రతినిధి: ఎంపీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి వంశీచందర్ రెడ్డిని గెలిపించాలని ఎంపీ అభ్యర్థి సతీమణి ఆశ్లేష రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించినట్టే, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్ల ను అభ్యర్థించారు. మన పాలమూరు జిల్లా వాసి రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నారని, వెనుకబడిన మన జిల్లా ను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. కౌన్సిలర్ యూ. మహేష్ , బండి వేణుగోపాల్, కోట్ల రవీందర్ రెడ్డి, బోయ శరణప్ప, లిఖి రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed