TS : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు

by Disha Web Desk 4 |
TS : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఫలితాలు జూన్ 4న తేలనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు రోజులను వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఈసీ పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పొడిగించిన విషయం తెలిసిదే. ఇక, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై సీరియస్ యాక్షన్స్ ఉంటాయిన ఈసీ హెచ్చరించింది.

Next Story

Most Viewed