మూన్నాళ్ళ ముచ్చటగా రహదారి మరమత్తు పనులు..

by Sumithra |
మూన్నాళ్ళ ముచ్చటగా రహదారి మరమత్తు పనులు..
X

దిశ, ఊట్కూర్ : మండల పరిధిలోని బిజ్వార్, పులిమామిడి గ్రామాల మధ్య బిటి రహదారి మరమ్మత్తు పనులు మూన్నాళ్ళ ముచ్చటగా మారిందని తెలంగాణ విద్యావంతుల వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుత్తేదారులు ఇటీవల రహదారిపై మరమత్తు పనులు చేసిన మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో రహదారి పై కంకర, తారు తేలి మళ్లీ యధాస్థితికి వచ్చిందని దీనికి కారణం గుత్తేదారులు కాదని, ముమ్మాటికి అధికారుల వైఫల్యమేనని ఆయన పేర్కొన్నారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారిని గుర్తించి కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి నాణ్యతతో కూడిన మరమ్మతులు చేపట్టాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed