కేసు డీల్ చేస్తానని 2 వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్

by Mahesh |
కేసు డీల్ చేస్తానని 2 వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ సస్పెండ్
X

దిశ, నాగర్ కర్నూల్/బిజినపల్లి : కేసు డీల్ చేస్తానని 2 వేలు లంచం తీసుకున్న కానిస్టేబుల్ అనే శీర్షికన శుక్రవారం దిశ దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి పోలీస్ అధికారులు స్పందించారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం రాత్రి కానిస్టేబుల్ వినోద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేశారని సీఐ కనకయ్య తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కల్మూరు సురేష్ ప్రేమ వివాహం చేసుకొని స్వగ్రామానికి రాగా యువతి కుటుంబీకులు అతనిపై దాడి చేసి యువతిని తీసుకువెళ్లారు. సురేష్ 100 దయల్‌కు ఫోన్ చేయడంతో బిజినపల్లి పిఎస్‌కు చెందిన వినోద్ రెడ్డి గంగారం గ్రామానికి వెళ్లి మీ కేస్ డీల్ చేస్తానని 2 వేలు లంచం తీసుకున్న విషయం పాఠకులకు విదితమే.

Advertisement

Next Story

Most Viewed