ప్రపంచ స్థాయి వేదికపై తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు

by Naveena |
ప్రపంచ స్థాయి వేదికపై తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు
X

దిశ, కొల్లాపూర్: లాస్ వెగాస్‌లోని మాండలే బేలో నిర్వ‌హించిన "ఐఎంఈఎక్స్ అమెరికా 2024" ట్రేడ్ షో లో ప్రపంచ స్థాయి వేదికను తెలంగాణ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించారు. తెలంగాణ శతాబ్దాల ఘనమైన చరిత్ర‌, వారసత్వం,సుసంపన్న సంస్కృతి,ప్ర‌కృతి ర‌మణీయ‌త‌,పర్యాటక ప్రాంతాల గురించి స్థానిక మీడియా,ట్రావెల్ సొల్యూషన్స్ ప్రతినిధులు, తెలుగు అసోసియేషన్ సభ్యులతో మంత్రి జూపల్లి చర్చించారు. విశ్వ‌న‌గ‌ర‌మైన‌ హైదరాబాదు “భారతదేశం సదస్సుల రాజధానిగా” అంత‌ర్జాతీయ సద‌స్సుల‌కు వేదిక‌గా,ప్రపంచ స్థాయి పెట్టుబడులకు కేంద్ర బిందువు గా మారింద‌న్నారు. ప‌ర్యాట‌క‌,వినోదం,వ్యాపార‌,ఐటీ,హెల్త్,ఫార్మా రంగాల్లో అత్యుత్తమ గ‌మ్య‌స్థానంగా నిలుస్తుంద‌ని ఆయన చెప్పారు. ప్రగతిశీల విధానాల‌తో త‌మ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించ‌డంతో పాటు..పర్యాటక రంగంలో భాగ‌స్వాముల‌ సహకారంపై దృష్టి పెట్టామ‌ని పేర్కొన్నారు. వాణిజ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో ఏర్పాటు చేసిన విదేశీ స్టాల్‌లను మంత్రి జూప‌ల్లి సంద‌ర్శించారు. కొత్త అనుభూతులు, అన్వేషించని ప్రదేశాలను చూడాలని కోరుకునే నేటి తరం పర్యాటకులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్దంగా ఉందన్నారు. ఘనమైన వారసత్వ సంపదతో అలరారుతున్న తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించాల‌ని ఆయా దేశాల ప్ర‌తినిధుల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆహ్వానం ప‌లికారు. భారతదేశం నుంచి వ‌చ్చిన అతి కొద్ది మందిలో ఒక తెలంగాణ ప్ర‌తినిధిగా ఈ ట్రేడ్ షోలో పాల్గొన‌డం తనకు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ‌ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రకాష్ రెడ్డి,పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి.ఎస్. ఓంప్రకాశ్, టిఎస్టిడిసి మార్కెటింగ్ జిఎం కె.అంజి రెడ్డి, హెచ్సీవిబి సిఇఓ గ్యారీ ఖాన్, హైటెక్స్ మీటీ, నాంధారి ఈవెంట్స్ నుండి సహ ప్రదర్శకులు హాజరయ్యారు.

Advertisement

Next Story