కూలిగా మారిన పద్మశ్రీ మొగులయ్య.. స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్

by Disha Web Desk 12 |
కూలిగా మారిన పద్మశ్రీ మొగులయ్య.. స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్
X

దిశ, అచ్చంపేట: గత ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న 12 మెట్ల కిన్నెర మొగులయ్య.. కుటుంబ జీవనం కోసం తీరును శుక్రవారం దిశ స్పెషల్ ఎడిషన్‌లో కథనం ఇచ్చింది. ఈ కథనంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... మొగులయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా వ్యక్తిగతంగా ఆదుకుంటానని పోస్ట్ చేశారు. అలాగే తన సిబ్బందిని మొగులయ్య ఇంటికి పంపించామన్నారు. మొగులయ్య స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలి కుంట గ్రామానికి చెందిన వ్యక్తి. ఇదిలా ఉంటే ఇటీవల మొగులయ్య తన కుటుంబాన్ని సాదడం కోసం.. రోజువారీ కూలి గా మారి మట్టిని మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed