గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

by Kalyani |
గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : స్థానిక ఎన్టీఆర్ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 19 గురు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ ఎం.విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అరబిక్-1, ఇంగ్లీష్ -3, సంస్కృతం-1, ఉర్దూ -1 కామర్స్-1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ -5, స్టాటిస్టిక్స్ -1, బయోటెక్నాలజీ -1, మైక్రో బయాలజీ -1, జువాలజీ-2, ఎకనామిక్స్(ఉర్దూ మీడియం)-1, పొలిటికల్ సైన్స్(ఉర్దూ మీడియం)-1 సబ్జెక్టుల్లో ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటి భర్తీకి సంబంధించిన సబ్జెక్టు పీజీలో జనరల్ 55 శాతం, ఎస్సీ, ఎస్టీ, 50 శాతం, అభ్యర్థులకు, పీహెచ్డీ, నెట్,సెట్, వంటి అదనపు అర్హతలు గల వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో నమోదు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.

Next Story

Most Viewed