- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నాలుగు టన్నుల ఎర్రచందనం స్వాధీనం..నలుగురు స్మగ్లర్లు అరెస్ట్
దిశ ప్రతినిధి,కడప:వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఇటీవల జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎర్రచందనం పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు బుధవారం పోట్లదుర్తిలో తరలించడానికి సిద్ధం చేసిన నాలుగు టన్నుల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సహకరిస్తున్న ట్రాక్టర్ మినీ ట్రాక్టర్ ఒక మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఎర్రగుంట్లలో ఉంటున్న దూదేకుల బాషా, పత్తికొండ మండలం హోసూర్ గ్రామానికి చెందిన, ప్రస్తుతం పోట్లదుర్తిలో ఉంటున్న పింజరి మహమ్మద్ రఫీ, ఇదే గ్రామానికి చెందిన పోట్లదుర్తిలోనే ఉంటున్న అరవోళ్ళ రఫీ ,పోట్లదుర్తి గ్రామం ఎన్టీఆర్ కాలనీ చెందిన చెల్లుబోయిన శివ సాయి లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వివరాలను వెల్లడించారు.