అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలి : మంత్రి జూపల్లి

by Disha Web Desk 23 |
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలి : మంత్రి జూపల్లి
X

దిశ, కొల్లాపూర్: అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం కోడేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని అన్నారు. అందుకు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేస్తూ మన కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్.మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన సోనియమ్మ,సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని అన్నారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామ్మోహన్రావు,భస్తిరాం,మహేశ్వర్ రెడ్డి,వేణుగోపాల్, ఎల్లపాగ మశన్న, రంగినేని జగదీశ్వరుడు, రాము యాదవ్ ఆయా గ్రామాల నుండి వచ్చిన మాజీ,ప్రస్తుత ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed