- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆదాయం పెంచడంలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించండి..

దిశ, మహబూబ్ నగర్: సంస్థ ఆదాయం పెంచడంలో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా సంస్థ ఆదాయం సమకూర్చడంలో దృష్టి సారించామని, అందుకు 'కండక్టర్ ఎంప్లాయ్ ఎజెంట్ సిస్టం' ను ప్రవేశపెట్టి ఉత్తమ ఫలితాలు సాధించిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను అందజేశామని ఆయన తెలిపారు.
అనంతరం ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ప్రయాణికుల మన్నలను ఎలా పొందాలి, వృతి నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలని విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆర్ఎం వి.శ్రీదేవి, డిప్యూటి ఆర్ఎంలు సత్యనారాయణ, శ్యామల, మహబూబ్ నగర్ డీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని 10 డిపో మేనేజర్లతో విస్త్రుతంగా సమావేశాన్ని నిర్వహించి ఫలితాలపై రివ్యూ చేశారు.