మాజీ ప్రజా ప్రతినిధి భార్య పై అసభ్యకర పోస్ట్ చేసిన మాజీ ఆర్మీ జవాన్

by Kalyani |
మాజీ ప్రజా ప్రతినిధి  భార్య పై అసభ్యకర పోస్ట్ చేసిన మాజీ ఆర్మీ జవాన్
X

దిశ, నాగర్ కర్నూల్ :- పాలెం మాజీ ప్రజా ప్రతినిధి భార్య పై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మాజీ ఆర్మీ జవాన్ ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఆర్మీ జవానును దేహశుద్ధి చేశారు. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.... పాలెం గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ జవాన్ మాజీ ప్రజా ప్రతినిధి భార్య పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు వైరల్ చేశాడు. దీంతో గ్రామ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆర్మీ జవాన్ ఇంటిని చుట్టుముట్టి దేహశుద్ధి చేశారు. మాజీ ప్రజా ప్రతినిధి భార్య పేరుతో సోషల్ మీడియాలో వైరల్ చేసిన పోస్టుకు ఆర్మీ జవాను భార్య పేరు పెట్టి ఎంపీపీ వర్గీయులు కూడా అదే పోస్ట్ ను వైరల్ చేశారు. ఆర్మీ జవాను దేహశుద్ధి అనంతరం ఎంపీపీ వర్గీయులతో క్షమాపణ కోరారు. ప్రస్తుతం ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సంఘటనకు సంబంధించి ఆర్మీ జవాను వివరణ కోసం దిశ ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండగా .. మాజీ ప్రజా ప్రతినిధి సైతం అందుబాటులోకి రాలేదు.. బిజినపల్లి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని తెలిసింది.

Next Story

Most Viewed