- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘లహరి’తో చిల్ అవ్వడమే! టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: హైటెక్ హంగులతో రూపొందించిన లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు దీటుగా ఈ బస్సులను రూపొందించారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వేసవిలో చల్లదనం అందించే టీఎస్ ఆర్టీసీ లహరి- ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. కాగా, ఈ ట్వీట్ నెటిజన్లు స్పందిస్తున్నారు. లహరి బస్సులు బాగున్నాయని, కానీ బస్సుల్లో స్పేస్ తక్కువగా ఉండటంతో కొంత అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు వరంగల్ నుంచి నిజమాబాద్ రూట్లో ఏసీ సర్వీస్లు నడిపించాలని ఓ నెటిజన్ కోరారు. కాగా, అత్యధునిక ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’ అని టీఎస్ ఆర్టీసీ గతంలో నామకరణం చేసింది.