తెలంగాణ కొండకల్‌లోని మేధా కోచ్‌ ఫ్యాక్టరీపై KTR స్పెషల్ ట్వీట్

by Anjali |   ( Updated:2024-08-26 11:04:13.0  )
తెలంగాణ కొండకల్‌లోని మేధా కోచ్‌ ఫ్యాక్టరీపై KTR స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండకల్‌లోని మేధా రైలు కోచ్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో అతిపెద్ద ప్రవేట్ కోచ్ ఫ్యాక్టరీలల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సుమారు రూ. 800 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కారణంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించాయి. తాజాగా దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన మరో అద్భుతమైన ఇంజినీరింగ్ కథ కొండకల్‌లోని మేధా కోచ్ ఫ్యాక్టరీ అని కొనియాడారు. నేడు ఈ యూనిట్ వందే భారత్ రైళ్లలో కీలక భాగంగా మారిందని చెప్పుకొచ్చారు. మేధా టీమ్ కశ్యప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి.. అలాగే మొత్తం టీమ్‌ గురించి చెప్పాలంటే కేటీఆర్‌కు చాలా గర్వంగా ఉందని అన్నారు.

KTR Tweet : https://x.com/KTRBRS/status/1828002778033131931

Advertisement

Next Story

Most Viewed