అశోక్ కుమార్ వెనక కేటీఆర్ ముఠా : రియాజ్

by Bhoopathi Nagaiah |
అశోక్ కుమార్ వెనక కేటీఆర్ ముఠా : రియాజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అశోక్ కుమార్ వెనక కేటీఆర్ పైసల ముఠా ఉన్నదని గ్రంథాలయ చైర్మన్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రియాజ్ ఆరోపించారు. గురువారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్‌తో కుమ్మక్కైన అశోక్ నిరుద్యోగులతో ధర్నాలు చేపిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నా బీఆర్ఎస్ కార్యకర్తల మార్చ్ అని విమర్శించారు. ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల మార్చ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గు మాలిన చర్య అని తప్పుబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం అన్నారు. అశోక్ నగర్ లో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, కేటీఆర్ అండ్ టీమ్ కట్టుకథలు అల్లి హేళన చేసిన చరిత్ర మర్చిపోయారా? అంటూ ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు నిర్లక్ష్యం చూపించిన బీఆర్ఎస్, ఇప్పుడు నిరుద్యోగులపై దొంగ ప్రేమ కురిపించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్న వారెవ్వరూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం లేదన్నారు. అడ్డ మీద కూలీలతో కేటీఆర్ మార్చ్ నిర్వహించారని విమర్శించారు. జీవో నెంబరు 46 పరిష్కారం దిశగా ప్రభుత్వం త్రీ మెన్ కమిటీని వేసిందన్నారు.

టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చనగాని దయాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో అశోకనగర్ లో చేసిన లాఠీ ఛార్జ్ ను ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. ఓయూలో మురళి ముదిరాజ్ ఆత్మహత్య సంఘటన ఇంకా నిరుద్యోగుల కళ్లల్లోనే తిరుగుతుందన్నారు. రాత్రి రెండు గంటల వరకు రెండు వేల మంది పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించిన చరిత్ర బీఆర్ఎస్‌దని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్, రవళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story