కాంగ్రెస్ మోసాలపై దసరా రోజు చర్చించండి: మాజీ మంత్రి హరీష్ రావు

by Mahesh |
కాంగ్రెస్ మోసాలపై దసరా రోజు చర్చించండి: మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దసరాకు ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుని కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని యువతకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు నిచ్చారు. గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ‘ఎక్స్ వేదికగా ఆదివారం కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదన్నారు. రుణమాఫీ పూర్తి చేయలేదు.. రైతు బంధును నిలిపివేశారు.. రైతు భరోసా దిక్కు లేకుండా పోయింది.. బోనస్‌ను బోగస్ చేశారని మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని.. పది నెలలు గడిచాయి అతీగతి లేదన్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారని దుయ్యబట్టారు. మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. ‘కాంగ్రెస్ ఫెయిల్ తెలంగాణ’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story