- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబును కలిసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. కారణం ఏంటంటే?
దిశ,వెబ్డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) రేపు(సోమవారం) ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబు వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఢిల్లీ పర్యటన నిమిత్తం వచ్చిన సీఎం చంద్రబాబును ఏపీకి చెందిన కీలక నేత కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు(ఆదివారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్(Hyderabad Jubilee Hills) లోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. ఇరువురి మధ్య ఏం అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.