రుణమాఫీపై మరోసారి ఫైర్ అయిన కేటీఆర్

by M.Rajitha |
రుణమాఫీపై మరోసారి ఫైర్ అయిన కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రుణమాఫీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇంకో 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో సీఎం రేవంత్ రెడ్డి బండారం మరోసారి బయటపడిందని పేర్కొన్నారు. 100% రుణమాఫీ చేశామని చెప్పింది అంతా డొల్లతనమని తేలిపోయిందన్నారు. ఎన్నికల అయిన వెంటనే అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి, 10 నెలలు దాటినా ఇంకా 20 లక్షల మందికి అందలేదంటే.. అనధికారంగా ఇంకా ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నిజాలు ఒప్పుకోకుండా అందరికీ 100% రుణమాఫీ జరిగిందని గొప్పలు చెపుకోవడం ఇప్పటికైనా ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రుణమాఫీ మాత్రమే కాదు సీజన్ ముగిసినప్పటికీ ఇంతవరకూ రైతుబంధు కూడా అందలేదని విమర్శలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed