ఉప ఎన్నికల్లో కడియంకు ఘోర పరాభవం తప్పదు: కేటీఆర్

by Mahesh |   ( Updated:2024-09-26 10:57:33.0  )
ఉప ఎన్నికల్లో కడియంకు ఘోర పరాభవం తప్పదు: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి((Kadiyam Srihari)) పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరిన విషయం తెలిసిందే. కాగా ఆయన గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కేటీఆర్ (KTR) చేసిన కామెంట్లపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫైర్ అయ్యారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలే జరిగితే.. బీఆర్ఎస్(BRS) పార్టీకి డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు. కాగా ఈ వ్యాఖ్యలపై కడియం శ్రీహరికి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, కడియం శ్రీహరి ఒక్కడే కాదు.. పది మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని.. ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed