గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

by M.Rajitha |
గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం గచ్చిబౌలిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం సృష్టించింది. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ, అదే కాలనీకి చెందిన ఆటోలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతిరోజూ లాగే ఈరోజు కూడా స్కూల్ ముగిసిన అనంతరం వారి ఆటో కోసం రోడ్డు మీద ఎదురు చూస్తుండగా.. అంతలో ఓ గుర్తు తెలియని ఆటోడ్రైవర్ వచ్చి వాళ్ళని బలవంతంగా ఆటో ఎక్కించుకున్నాడు. ఆటో వారి ఇంటివైపు కాకుండా మరో రూట్లో శ్మశానం వైపు వెళ్తుండగా, భయపడిన చిన్నారులు కేకలు వేశారు. అటుగా వెళ్తున్న మరో ఆటోడ్రైవర్ చిన్నారుల కేకలు విని, పక్కనే ఉన్న క్యాబ్ డ్రైవర్ సహాయంతో ఆ ఆటోను అడ్డుకొని, డ్రైవర్ ను పోలీసులకు అప్పగించాడు. కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సమయానికి స్పందించి చిన్నారులను కాపాడిన ఆటోడ్రైవర్ ను పోలీసులు అభినందించారు.

Next Story

Most Viewed