బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు..

by Sumithra |
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు..
X

దిశ, కరకగూడెం : నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేస్తున్న కృషికి ఆకర్షితులై మండల పర్యటనలో భాగంగా భట్టుపల్లి మాజీ సర్పంచ్ తొలేం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అనుచరుడు వాసిరెడ్డి నేతాజీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నేతాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారని ఆయన ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed