- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రగడ..
దిశ, ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో మజీద్ మరమ్మతుల కోసం ప్రభుత్వ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రగడ జరిగింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 53 మజీద్ లకు చెక్కులు, రఘునాథ పాలెం మండలంలో 10 మజీద్ లకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఖమ్మం నగరంలోని షాదీఖానాలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కులు పంపిణీ మొదలు పెట్టారు.
కాగా ఖమ్మం నగరంలోని అస్తబల్ మజీద్ చెక్కును అక్బర్ అనే వ్యక్తికి ఇస్తున్న సమయంలో అ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు అతనికి ఎలా ఇస్తారు అంటూ చిందులు వేశారు. అతను పాత కమిటీ సభ్యులు.. ఇప్పుడు కొత్త కమిటీ ఉందని వాళ్లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అస్తబల్ మజీద్ కు వచ్చిన చెక్కును మైనారిటీ సంక్షేమ అధికారులు నిలిపివేశారు. దీంతో మజీద్ యువకులు అధికారుల పనితీరు పై మండిపడ్డారు.