ప్రతి పథకం ఒక మహా యజ్ఞం : ఎమ్మెల్యే హరిప్రియ

by Sridhar Babu |
ప్రతి పథకం ఒక మహా యజ్ఞం : ఎమ్మెల్యే హరిప్రియ
X

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలం రామచంద్ర పేట పంచాయతీకి చెందిన లింగాల రాంబాబు కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో రూ.2,50,000ల ఎల్ ఓ సీ చెక్కును ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరి ప్రియ హరి సింగ్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం మహా యజ్ఞంలా కొనసాగుతుందన్నారు. చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ చెక్కులు ప్రాణదానం చేస్తున్నాయన్నారు.

కష్ట కాలంలో ఆదుకుంటూ దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎల్ఓసీతో చికిత్స సహాయం పొందుతున్నారన్నారు. ఆపద కాలంలో తమ కుటుంబానికి అండగా ఉంటూ ఎల్ఓసీ చెక్కు రూపంలో సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే శ్రీమతి బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్కు లింగాల రాంబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, మండల ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, మండల యూత్ ప్రెసిడెంట్ బర్మావత్ శివకృష్ణ , డిష్ ప్రసాద్, మూడు బాలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed