వరద బాధితులకు వంట సామాన్లు పంపిణీ

by Sridhar Babu |
వరద బాధితులకు వంట సామాన్లు పంపిణీ
X

దిశ బ్యూరో, ఖమ్మం : ఇటీవల మున్నేరు వరదకు సర్వం కోల్పోయిన ఖమ్మం పట్టణంలోని రామన్నపేట కాలనీ, దంసాలాపురం, ప్రకాష్ నగర్, బొక్కలగడ్డ వరద బాధితులకు చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంట సామాన్ల కిట్లు పంపిణీ చేశారు. ఇంటికి కావాల్సిన వంట పాత్రలు కడాయి, ప్లేట్ లు, గ్లాస్ లు, స్టీల్ గిన్నెలు, కుక్కర్లు, గంటెలు తదితర సామాన్లను బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఖమ్మంలో మున్నేరు వరదల సమయంలో చేతన ఫౌండేషన్ వెంటనే స్పందించి పలు సహాయ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ముత్తినేని సురేష్, చంద్రకాని నవీన్, మాదినేని నరసింహారావు, దొడ్డపనేని కృష్ణారావు, షేక్ రషీదు పాల్గొన్నారు.

Advertisement

Next Story