ముహూర్తం కోసం మంత్రి రాకముందే పూజ ..

by Aamani |
ముహూర్తం కోసం మంత్రి రాకముందే పూజ ..
X

దిశ,మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై నూతనంగా ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కుందూరు రఘువీరా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లేకుండానే ఆర్ అండ్ బి అధికారులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జిల్లా మంత్రితోపాటు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు హాజరు కావాల్సింది. కానీ ముహూర్తం దాటిపోతుంది అంటూ ప్రజా ప్రతినిధులు లేకుండా అధికారులే కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో మంత్రి రాక కోసం ఎదురుచూస్తున్న స్థానికులు అధికారులు ప్రారంభించడంతో విస్మయానికి గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed