- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తక్షణమే పంట నష్టపరిహారం అందించాలి
by Sridhar Babu |
X
దిశ,తిరుమలాయపాలెం : అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ధర్నాలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ మండలంలోని ఆకేరు పరీవాహక గ్రామాల్లో వరదలతో వందల ఎకరాల పంట ధ్వంసమైందని, వ్యవసాయ భూములు స్వరూపం కోల్పోయాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు తుళ్లూరు నాగేశ్వరరావు, కొలిచలం స్వామి, దేశ్య, భానుచందర్ పాల్గొన్నారు.
Advertisement
- Tags
- Farmers strike
Next Story