విజయవాడలో ప్రారంభమయిన డ్రోన్ షో

by M.Rajitha |
విజయవాడలో ప్రారంభమయిన డ్రోన్ షో
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో విజయవాడలోని కృష్ణా నది తీరంలో డ్రోన్ షో(Drone Show) అట్టహాసంగా ప్రారంభం అయింది. కృష్ణా నది తీరంలోని పున్నమి ఘాట్ లో జరుగుతున్న డ్రోన్ షోకి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) హాజరయ్యారు. డ్రోన్ షోకి ముందు జరిగిన లేజర్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 5,500 డ్రోన్లతో దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద షోను నిర్వహిస్తున్నారు. డ్రోన్ షోను వీక్షించేందుకు పున్నమి ఘాట్ లో నాలుగు చోట్ల భారీ డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు. కాగా ఈ ప్రదర్శనను తిలకించేందుకు బెజవాడ వాసులు భారీగా తరలివచ్చారు.

Advertisement

Next Story

Most Viewed