రెండు గంటలకు నూతన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ప్రారంభం..

by Sumithra |
రెండు గంటలకు నూతన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ప్రారంభం..
X

దిశ, కొత్తగూడెం : నూతన ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, మరల తిరిగి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించనున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం కౌన్సిలింగ్ వాయిదా పడిందని ఉపాధ్యాయులు వెను తిరిగి వెళ్లిపోయారు. కౌన్సిలింగ్ నిర్వహించమని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ సిబ్బంది డీఎస్సీ 2024 నూతన ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి కొత్తగూడెంలోని పాత కొత్తగూడెం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి తిరిగి రావాలని సమాచారం అందిస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక నూతన ఉపాధ్యాయులు గందరగోళంలో ఉన్నారు

Advertisement

Next Story

Most Viewed