మధువన్ ఫుడ్ ప్లాజాలో పాచిపోయిన బిర్యాని

by Sridhar Babu |
మధువన్ ఫుడ్ ప్లాజాలో పాచిపోయిన బిర్యాని
X

దిశ, కొత్తగూడెం : పాచిపోయిన వెజ్ బిర్యానీని వినియోగదారుడికి అమ్మిన ఘటన ఆదివారం కొత్తగూడెంలో జరిగింది. వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెం మధురబస్తీ కి చెందిన ఒక వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ కాంప్లెక్స్ లోని మధువన్ ఫుడ్ ప్లాజాలో వెజ్ బిర్యానీని కొనుగోలు చేశాడు. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి బిర్యానీని ఇంట్లోని కుటుంబ సభ్యులకి తెచ్చి ఇవ్వడంతో వారు తినేందుకు పార్సల్ తెరిచి కొంత తినగా విపరీతమైన దుర్వాసన వచ్చింది.

దీంతో తినలేక పక్కకు పెట్టేశారు. వెంటనే సదరు వినియోగదారుడు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కు, మున్సిపల్ కమిషనర్ శేషాంజనేయ స్వామికి ఫోన్​ ద్వారా ఫిర్యాదు చేశాడు. మధువన్ ఫుడ్ ప్లాజా కి వెళ్లి సిబ్బందిని నిలదీశాడు. స్పందించిన సిబ్బంది పొరపాటు జరిగిందని ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed