- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పనులు పూర్తి కాకముందే…పైసా వసూల్
దిశ, నేలకొండపల్లి: ఖమ్మం–కోదాడ హైవేపై సోమవారం నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ కాకుండానే నేలకొండపల్లి మండలం పైనంపల్లి దగ్గర సిబ్బందిని నియమించి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.పైనం పల్లి వద్ద ,రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్డు సమీపంలో రెండు చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పూర్తి కాలేదు. రహదారి పై ఇంకా గ్రావెల్ ఫిల్లింగ్ చేయలేదు. దీంతో ఈ రెండు చోట్ల ప్రస్తుతం వాహనదారులు సర్వీస్ రోడ్డునే ఉపయోగించాల్సి వస్తోంది. మరోవైపు ఖమ్మం, కోదాడ మధ్య పాత రోడ్డుపై ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు నుంచి, వెంకటగిరి వరకు వెళ్లిన వాహనాలు,ఇటు రాజేశ్వరపురం,కూసుమంచి వచ్చే వాహనాలు కూడా కిలోమీటర్ దూరం కూడా జర్నీ చేయకుండానే టోల్ ఫీజు కట్టాల్సి వస్తోంది. వెంకట గిరి క్రాస్ రోడ్ సమీపంలో రెండు జాతీయ రహదారులు కలుస్తున్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్ ప్రకారం రెండు హైవేలు కలిసే చోట గ్రేడ్ సెపరేటెడ్ జంక్షన్ నిర్మించాల్సి ఉన్నా ఆఫీసర్లు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పనులు కంప్లీట్ కాకముందే టోల్ వసూలు చేయడంపై వాహనదారులు, సమీప గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.