- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ను ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు..
దిశ, సత్తుపల్లి: సత్తుపల్లిలో అంగన్వాడి ఉద్యోగులు తమ సమ్యలు పరిష్కారంలో భాగంగా 15 వ రోజు సమ్మె తో బస్టాండ్ ఎదురుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని చేరి క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై కూర్చొని నిరసన దీక్ష చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ, అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లను వెంటనే తీర్చాలని కోరారు.
అనంతరం స్థానిక మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్కు అంగన్వాడి ఉద్యోగుల 28 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మహేష్ మాట్లాడుతూ.. వినతి పత్రం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హమీతో ఉద్యోగులు నిరసన దీక్షను విరమించ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఎంఎల్ పార్టీ నాయకులు పాండు, మల్లూరు చంద్రశేఖర్, కోలికపోగు సర్వేశ్వరరావు, సుశీల, ఉదయశ్రీ, నాగేంద్ర ఇంద్ర, తదితరులు పాల్గొన్నారు.