సీఎస్​ శాంతి కుమారికి అరుదైన గౌరవం

by Disha Web Desk 15 |
సీఎస్​ శాంతి కుమారికి అరుదైన గౌరవం
X

దిశ, భద్రాచలం : తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి అరుదైన గౌరవం దక్కింది. భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకుని వస్తారు. కొన్ని సార్లు ఎండోమెంట్ మినిస్టర్లు తీసుకునివచ్చారు.

కానీ ఇంత వరకూ చీఫ్ సెక్రటరీ రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించలేదు. తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి ఈ విషయంలో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మహిళా సీఎస్ ఆమె కావడం... ఇప్పుడు బుధవారం భద్రాచలంలో జరిగిన రామయ్య కళ్యాణంలో పట్టు వస్త్రాలు సమర్పించిన తొలి సీఎస్ కూడా శాంతి కుమారి కావడం ఆమెకు అరుదైన గౌరవం లభించింది.

Next Story

Most Viewed