కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నేతల కీలక వినతి

by Mahesh |   ( Updated:2024-10-18 10:58:06.0  )
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నేతల కీలక వినతి
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ బీసీ సంఘం నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తో మాట్లాడిన వారు.. కులగణన కు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే.. కులగణన అంటూ కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కులగణపై బీసీ సంఘం నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ బీసీ కులగణన చేయడానికి, జిఓ నెంబర్ 18 ను విడుదల చేసిందని BC సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. అలాగే బీసీ కులగణనపై ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం ఉంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed