ఇంటర్ ఫలితాల నేపధ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య సందేశం!

by Disha Web Desk 5 |
ఇంటర్ ఫలితాల నేపధ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య సందేశం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ, మీ ఫలితాలను సానుకూలంగా తీసుకొని, మీ విద్యా జీవితంలో చేరుకున్న ఈ మైలురాయిని సెలబ్రేట్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏస్ బుర్రా వెంకటేశం అన్నారు. మంగళవారం ఇంటర్మీడియట్ ఫలితాల నేపధ్యంలో ఇంటర్ విద్యార్ధులకు ఆయన తన సందేశాన్ని ఇచ్చారు. ఇంటర్ విద్యార్ధులు తమ భవిష్యత్తు ఆకాంక్షలు, గత ప్రయత్నాల మధ్య వారధి అయిన ఇంటర్మీడియట్ దాటినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే.. మీ లోపాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఫలితాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అవి మీ ప్రేరణ, ఉత్సాహంపై ప్రభావం చూపించవద్దని అన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా నిజాయితీతో ముందుకు సాగి, మీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో పాటు ఈ దేశం కూడా గర్వించేలా చేయండి! అంటూ ఇంటర్ విద్యార్ధులకు బుర్రా వెంకటేశం తన సందేశాన్ని ఇచ్చారు.



Next Story