లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరంతో ‘నో యూజ్’: సీఎం రేవంత్

by Satheesh |
లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరంతో ‘నో యూజ్’: సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఉపయోగం లేకుండా పోయిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చేనట్లే పోతుందని, బ్యారేజ్ డ్యామేజీ కావడంతో నీరు నిల్వ చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు. గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా కొత్తగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని.. ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ పని పూర్తి చేయకుండా వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed