‘ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎవరి ముందు తలవంచేదేలే.. చివరికి న్యాయమే గెలిచింది’: BRS

by Anjali |   ( Updated:2024-08-27 15:43:31.0  )
‘ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎవరి ముందు తలవంచేదేలే.. చివరికి న్యాయమే గెలిచింది’: BRS
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. మార్చి 15 వ తేదీన అరెస్టైన కవితకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటున్నారు. న్యాయం, ధర్మం ఏనాటికి అయినా గెలిచి తీరుతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా ఎమ్మెల్సీ కవితను 166 రోజులు జైల్లో పెట్టారని, రాజకీయ ప్రేరేపిత కేసులో ఆఖరికి న్యాయమే గెలిచింది. మా కవితక్కకు నేడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎవరి ముందు తలవంచలేదేలే. కడిగిన ముత్యం లాగా బయటికి వచ్చింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed