ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

by Sridhar Babu |
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
X

దిశ, కొడిమ్యాల : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, మిల్లర్లు ధాన్యం విషయంలో ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఇబ్బంది పెడితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజా నర్సింగరావు, మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, అగ్రికల్చర్ అధికారిని జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

Next Story