ఒకే కుటుంబంలోని అన్నాచెల్లెళ్లు.. మరో కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లతో ప్రేమ.. పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో!

by Anjali |   ( Updated:2024-07-13 05:59:30.0  )
ఒకే కుటుంబంలోని అన్నాచెల్లెళ్లు.. మరో కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లతో ప్రేమ.. పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించిన వారితో పెళ్లికి ఒప్పుకోలేదని అన్నా, చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఒకే కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెలు మరో కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెళ్లను ప్రేమించారు. మూడు నెలల వ్యవధిలో ఒక కుటుంబానికి చెందిన అన్న చెల్లెలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పాలకుర్తి లింగయ్య, పద్మ దంపతులకు కొడుకు ప్రశాంత్(22), కూతురు నవ్య ఉన్నారు. నవ్యకు ఆరు నెలల కింద ఓ యువకుడితో పెళ్లైంది. అతడు పెళ్లి అనంతరం గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. అప్పుడు నవ్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదేండ్ల నుంచి ప్రేమలో ఉన్న విషయం తల్లితండ్రులకు చెప్పింది. సదరు యువకుడితో పెండ్లి చేయాలని కోరింది. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పురుగుల మందు తాగి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. నవ్య ప్రేమించిన యువకుడి చెల్లెలు నవ్య సోదరుడైన ప్రశాంత్ కూడా ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

Advertisement

Next Story

Most Viewed