పదో తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్

by Aamani |
పదో తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్
X

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలో సువిద్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని కర్ర విరిగేలా కొట్టడం తో తీవ్రంగా గాయపడ్డాడు.స్కూల్ లో నిర్వహించిన పరీక్షలో పదవ తరగతి విద్యార్థి కాపీకి పాల్పడ్డాడని వాతలు వచ్చేలా టీచర్ చితక బాధింది. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పాఠశాల యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేస్తే దండించాలి కానీ కర్ర విరిగే వరకు వాతలు వచ్చేలా కొడతారా అంటూ మండిపడ్డారు. కర్రతో విద్యార్థిని కొట్టడంతో విద్యార్థి తొడ కమిలిపోయింది. ఈ ఘటనపై పలువురు విద్యార్థి నాయకులు టీచర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై సువిద్య పాఠశాల హెడ్మాస్టర్ ని సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.

Advertisement

Next Story

Most Viewed