ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం..

by Sumithra |
ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం..
X

దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే నూతన కార్యవర్గాన్ని అభినందించారు. వేంకటేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి, గొప్ప పర్యాటక, పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు.

ఈ మేరకు ఆయలకమిటీ నూతన అధ్యక్షులుగా కటుకం రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్, సర్పంచ్ తోట శారద లింగారెడ్డి, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story