అపరిశుభ్రంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం..

by Sumithra |
అపరిశుభ్రంగా మండల ప్రజాపరిషత్ కార్యాలయం..
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. వివరాల్లోకి వెళితే ప్రతిరోజు వందలాది మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం, వివిధ పనుల నిమిత్తం ఎంపీడీవో కార్యాలయానికి వస్తూ ఉంటారు. కానీ కార్యాలయంలో అడుగుపెడితే అపరిశుభ్ర వాతావరణం స్వాగతం పలుకుతుంది. నాలుగు వేప చెట్ల నుండి రాలిన వేప గింజలు ఆ గింజల పై లక్షలాది ఈగలు అడుగుపెడితే జిబ్బున ముసురుకుంటున్నాయి.

అయినా అధికారులు ఎవరికీ పట్టడం లేదు. ఆఫీసు ముందు ఎలా ఉన్నా తాము కూర్చునే కుర్చి బాగుంటే సరిపోతుంది అనే భావనలో ఉన్నారా ? అని వచ్చిన ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా కార్యాలయం ఆవరణంలో పందుల గుంపు సంచరించినా కూడా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. గ్రామాల పరిశుభ్రత విషయంలో ఒంటి కాలి పై లేచే అధికారులు తమ కార్యాలయంలోని పరిశుభ్రతను మరిచారా ? ఇప్పటికైనా అధికారులు తక్షణము మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed