అల్లు అర్జున్‌కి ఆ పిచ్చి ఎక్కువ.. దాని కోసం కోట్లల్లో ఖర్చు చేస్తాడు.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..!

by Kavitha |   ( Updated:2024-07-06 09:47:25.0  )
అల్లు అర్జున్‌కి ఆ పిచ్చి ఎక్కువ.. దాని కోసం కోట్లల్లో ఖర్చు చేస్తాడు.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుపై ఎలాంటి నెగిటివ్ ప్రచారం, ట్రోల్స్ జరిగిందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. నిన్న మొన్నటి వరకు మెగా హీరో అంటూ డప్పు కొట్టిన జనాలే మెగా ఫ్యామిలీకి బద్ధ శత్రువు అల్లు అర్జున్ అంటూ టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేశారు.

అయితే రీసెంట్‌గా డైరెక్టర్ గీతాకృష్ణ అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. "అల్లు అర్జు‌న్‌కి పబ్లిసిటీ పిచ్చి. దానికోసం ఏమైనా చేస్తాడు. ఆ పబ్లిసిటీ కోసమే బాగా ఖర్చు పెడుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ని పొగిడేస్తే ఆయనకు విపరీతమైన ఆనందం అందుకోసమే పోస్ట్ పెడుతూ ఉంటారు. ఎక్కడో ఒక కార్యక్రమంలో అన్నాడు కదా నా దగ్గర ఒక ఆర్మీ ఉంది అని ఆ ఆర్మీ ఇదే. సినిమా రిలీజ్ కాగానే ఇన్ ఫ్లూయెన్సర్స్ మీద కోటి రూపాయలు ఖర్చు పెడితే దానికి మంచి పబ్లిసిటీ వచ్చేస్తది. అలా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తే అల్లు అర్జున్ గురించే భజన చేస్తూ ఉంటారు.

డబ్బు లేకుండా పవన్ కళ్యాణ్ చూడటానికి ఎంత మంది వస్తారో అందులో సగం మందైన అల్లు అర్జున్ చూడడానికి వస్తారు. ఎందుకంటే పుష్ప హిట్ అయ్యి నేషనల్ అవార్డు గెలిచాడు. కాబట్టి అల్లు అర్జున్ చూడడానికి చాలామంది వస్తారు. ఆ విషయం అతనికి కూడా తెలుసు దానికోసమే ప్రచారాల్లోకి వెళ్ళాడు. కానీ ఆయన టైం బ్యాడ్ సినిమాల పరంగా ఆయన ఫుల్ నెగిటివ్గా మారిపోయాడు అంటూ డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Advertisement

Next Story

Most Viewed