వేణు స్వామి చెప్పిందే నిజమయ్యిందా.. పెళ్లి తర్వాత తన భర్త వలన సమస్యల్లో రకుల్!

by Jakkula Samataha |
వేణు స్వామి చెప్పిందే నిజమయ్యిందా.. పెళ్లి తర్వాత తన భర్త వలన సమస్యల్లో రకుల్!
X

దిశ, సినిమా : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లీల సమయంలో వేణుస్వామి వారి జాతకాలు చూసి, వీరికి మ్యారేజ్ కలిసి రాదంటూ చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా, సమంత, నయనతార, అనుష్కలకు పెళ్లి జీవితం అస్సలే అచ్చిరాదని, వీరు వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే రకుల్ పై కూడా వేణు స్వామి పలు వ్యాఖ్యలు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకున్న తర్వాత అంతగా కలిసిరాదని, తాను పలు సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు.

కాగా, ప్రస్తుతం రకుల్ జీవితంలో కూడా సమస్యలు మొదలైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భర్త తన నిర్మాణ సంస్థలో కొంత మందికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి నట్టు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నిర్మాణ సంస్థలో పెద్ద సినిమా చేశారు. నటీనటులందరికీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. కానీ మాకు చాలా రోజుల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. కొన్నిరోజులైతే ఏం కాదు కానీ, చాలా రోజుల నుంచి సాలరీస్ ఇవ్వడం లేదు అంటూ కొందరు వాపోయారు. ప్రస్తుతం ఈ వార్త బయటకు లీక్ కావడంతో ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రకుల్ జీవితంలో ఆర్థిక సమస్యలు మొదలు అయ్యాయి. ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అచ్చిరాలేదు, అచ్చం వేణుస్వామి చెప్పినట్లే జరుగుతుంది అంటున్నారు కొందరు.

Advertisement

Next Story

Most Viewed