తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా

by Disha Web Desk 12 |
తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా
X

దిశ, గన్నేరువరం: సరదాగా ఈతకు వెళ్లగా నీటిలో మునిగి తండ్రీకొడుకులు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద సంఘటన తిమ్మాపూర్ మండలం వచ్చు నూరు గ్రామం శివారులో గల లోయర్ మానేరు డ్యామ్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్‌ఆర్‌కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి అతని ఇద్దరు కుమారులకు ఈత నేర్పించడానికి లోయర్ మానేరు డ్యామ్ వద్దకు తీసుకెళ్లాడు. కాగా పెద్ద కుమారుడు ఒడ్డుపై కూర్చోగా.. తండ్రి చిన్న కుమారుడు. చైతన్యానంద(9) నీటిలో దిగారు. ఇంతలో వారు లోతుల్లోకి వెళ్లి నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఇది గమనించిన స్థానిక జాలర్లు తండ్రి కొడుకుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed