'ఆర్టీసీ సమస్యలపై ప్రశ్నించండి..?'.. రేవంత్‌ని కోరిన జేఏసీ

by Vinod kumar |
ఆర్టీసీ సమస్యలపై ప్రశ్నించండి..?.. రేవంత్‌ని కోరిన జేఏసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ జాయింట్ యాక్షన్​కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కోరింది. ఆర్టీసీ పరిస్థితులపై ఈ నెల 16న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రావాలని జేఏసీ చైర్మన్​రాజిరెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లో రేవంత్‌కు ఆహ్వానం అందించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇన్విటేషన్ ఇచ్చామని, ఆ సమావేశం లో తీర్మానం తర్వాత ఆర్టీసీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని రాజిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed