T-బీజేపీలో ఇంటర్నల్ వార్.. తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యేలు

by Rajesh |
T-బీజేపీలో ఇంటర్నల్ వార్.. తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బీజేపీలో ఇంటర్నల్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయక త్వం, ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదని సమాచారం. ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ జరుగుతోంది. కనీసం బీజేఎల్పీ నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. తె లంగాణలో బీజేపీ నుంచి మొత్తం 8 మంది ఎమ్మె ల్యేలు గెలిచారు. గెలిచిన వారిలో ఆరుగురు ఎమ్మె ల్యేలు చట్ట సభల్లోకి కొత్తగా అడుగుపెట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరే అందులో సీనియర్లు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏయే అంశాలు ప్రస్తావించాలి? ఏయే హామీలపై రాష్ట్ర సర్కార్‌ను ఇరుకున పెట్టాలనే అంశాలపై సబ్జెక్ట్ అందించే సహకారం కూడా ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ బీజేపీ పరిస్థితి ఇతర పార్టీలకు భిన్నంగా తయారైంది. అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీల్లో పలు అంశాలపై సబ్జెక్ట్ అందించడంతో పాటు ఎలా వ్యవహరించాలి, ఏయే అంశాలను లేవనెత్తాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తారు. కానీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. స్టేట్ బాడీ దిశానిర్దేశం చేయలేకపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగా.. బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు. తెలంగాణ కాషాయ పార్టీ లో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగానే ఉన్నా రాష్ట్ర నాయకులకు కనీసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కమలం పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాషాయపార్టీ నేతలు ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫొటో తప్ప మిగతా వారి ఫొటోలు కూడా ముద్రించలేదు. బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి పార్టీలో కీలకమైన పదవి. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీబీజేపీలో ఏర్పడింది. మరి ఈ అంతర్గత వివాదాలను పార్టీ జాతీయ నాయకత్వం అయినా పట్టించుకుని సరిదిద్దుతుందా? లేదా? చూడాలి.

Advertisement

Next Story

Most Viewed