మూసీ రివర్‌ను మళ్లీ రీ సర్వే చేయాలని కలెక్టర్‌ను కోరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

by Mahesh |
మూసీ రివర్‌ను మళ్లీ రీ సర్వే చేయాలని కలెక్టర్‌ను కోరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు
X

దిశ, కార్వాన్: మూసీ రివర్ బెడ్‌ను రీ సర్వే చేయాలని హైదరాబాద్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి‌ను కోరారు. జాతి పిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని లంగర్ హౌస్ బాపుగాట్‌ను సందర్శించేందుకు వచ్చిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి నగరానికి చెందిన కార్వాన్, చారిమినార్, బహుదూర్‌పుర ఎమ్మెల్యేలు కౌసర్ మొయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహమ్మద్ ముబీన్ లు కలిసి మూసీ రివర్ బెడ్ ను రీసర్వ్ చేయించాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యేల సమస్యని సానుకూలంగా స్పందించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నగర ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed