Zakir Naik : పాకిస్తాన్‌లో జాకిర్ నాయక్.. స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రతినిధులు

by Hajipasha |
Zakir Naik : పాకిస్తాన్‌లో జాకిర్ నాయక్.. స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రతినిధులు
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత దర్యాప్తు సంస్థల వాంటెడ్ లిస్టులో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకిర్ నాయక్ సోమవారం పాకిస్తాన్‌కు చేరుకున్నారు. ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు పాకిస్తాన్ ప్రధానమంత్రి యూత్ ప్రోగ్రాం ఛైర్మన్ రాణా మసూద్, మత వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సయ్యద్ అతావుర్ రహమాన్ స్వాగతం పలికారు.

జాకిర్ నాయక్‌కు పాక్ సర్కారు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అక్టోబరు 20 వరకు వివిధ తేదీల్లో ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లలో జరిగే మత సభలలో ఆయన ప్రసంగించనున్నారు. జాకిర్ నాయక్ వెంట ఆయన కుమారుడు ఫారిఖ్ నాయక్ కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed