- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు మూడో ర్యాంక్

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్ ర్యాంకింగ్ (డియూఆర్) రిపోర్ట్ - కన్జుమర్సర్వీస్రేటింగ్ఆఫ్డిస్కం స్రిపోర్ట్ 2023 -24 లో కేటగిరీ పరంగా మూడోవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కేటగిరిలో మొత్తం 41 విద్యుత్ పంపిణి సంస్థలకు ర్యాంకులు కేటాయించగా , టీజీ ఎస్పిడిసిఎల్కు 3వ స్థానం రావడం విశేషం. దక్షిణ డిస్కం తన పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా తో పాటు, ఇతర డిస్కం లతో పోల్చుకుంటే అతి తక్కువ సమయంలో విద్యుత్ కనెక్షన్ ల మంజూరు, అతి కొద్ది పత్రాలతో వివిధ సేవలు పొందేలా నియమ నిబంధలను సరళతరం చేయడం, ఖచ్చితమైన బిల్లింగ్, సరైన మీటరింగ్ కోసం ఐఆర్ పోర్ట్ ఆధారిత మీటర్లను అమర్చడం, వినియోగదారుల ఫిర్యాదులు వెంటనే పరిష్కరించడం, విద్యుత్ కార్యాలయాలను సందర్శించకుండానే నేరుగా ఆన్లైన్ లోనే సంస్థ వెబ్ సైట్ , మొబైల్ ఆప్ ను సందర్శించి దాదాపు 99 శాతం విద్యుత్ సంబంధిత సేవలు పొందేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు గాను కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ మొచ్చుకుంది. ఈ గుర్తింపు రావడం పట్ల టీజీఎస్పిడిసిఎల్సీఎండి ముషారఫ్ ఫరూఖీ తమ వినియోగదారులకు, అధికారులకు, సిబ్బందికి అభినందలు తెలిపారు. భవిష్యత్ లోను సంస్థను మరింత వున్నత స్థానాలకు చేరేలా కృషి చేయాలని సూచించారు.